నవతెలంగాణ-అల్వాల్
మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ నిరంతరం పని చేస్తున్నా యని సైబరాబాద్ షీ టీమ్ ఎస్సై శ్రీనివాస్ అన్నారు. గురువారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంట గణేష్ టెంపుల్ వద్ద షీ టీమ్ సేవలపై యుతకు అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మహిళలు తమపై జరిగే వేధింపు లపై మౌనంగా భరించాల్సిన అవసరం లేదన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్ 24 గంటలు అందుబాటు లో ఉంటుందని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో, బస్సు స్టాప్లో, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ ఎక్కడైనా ఆకతాయిలు వేధిస్తే వెంటనే 100కు కాల్ చేయాలని సూచించారు. యువకులు మహిళలు, విద్యార్థినిల పట్ల సోదరభావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది చంద్రమోహన్, వెంకటేష్, సంధ్య పాల్గొన్నారు.