లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

నవతెలంగాణ – హైదరాబాద్:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఆటో, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు రాణించడంతో మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 73వేల ఎగువ ముగిసింది. కిత్రం సెషన్‌తో పోలిస్తే ఉదయం సెన్సెక్స్‌ స్వల్ప నష్టాల్లో మొదలవగా.. ఆ తర్వాత కోలుకుంది. 72,683.99 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌.. గరిష్ఠంగా 73,286.26 పాయింట్లకు పెరిగింది. చివరకు 328.48 పాయింట్లు పెరిగి.. 73,104.61 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 113.80 పాయింట్లు పెరిగి.. 22,217.85 వద్ద ముగిసింది.

Spread the love