స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి గంట వరకు అదే బాటలో పయనించాయి. చివర్లో వచ్చిన అమ్మకాలు సూచీలను దిగజార్చాయి. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ఆఖర్లో సూచీలను కిందుకు లాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను కలవరపర్చాయి. అదానీ గ్రూప్‌ షేర్ల ర్యాలీ ఈరోజు కూడా కొనసాగింది.

Spread the love