పుట్టిన బిడ్డల్ని గొంతుకోసి చంపేసి.. ఏళ్లపాటు ఫ్రిజ్‌లో దాచి..!

 

 

నవతెలంగాణ – ఢిల్లీ
దక్షిణ కొరియాలో ఓ మహిళ తన నవజాత శిశువులను ఇద్దరిని చంపేసి, సంవత్సరాల కొలది ప్రిజ్ లో భద్రపరిచింది. వారెంట్ తో సదరు మహిళను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దక్షణి కొరియాలోని సువాన్ నగరానికి చెందిన మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2018లో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆమెను చంపి ఫ్రిజ్ లో పెట్టింది. 2019లో మరో పాప పుట్టగానే గొంతుకోసి హత్య చేసింది. ఆస్పత్రిలో డెలివరీ అయినట్లు రికార్డులు ఉన్నాయి. కానీ పిల్లల పేర్లు నమోదు చేసినట్లు లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆ ఏడాది మే నెలలో ఆరా తీయగా ఈ దారుణం వెలుగు చూసింది. తన నవజాత శిశువులను తనే దారుణంగా హత్య చేసిన్నట్లు ఆ మహిళ అంగీకరించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అలా చేయవలసి వచ్చిందని తెలిపింది. ఈ హత్యల గురించి తనకు తెలియదని ఆ మహిళ భర్త చెప్పాడు. ఆ రెండుసార్లు అబార్షన్ చేయించుకున్నట్లు తనతో భార్య చెప్పిందన్నాడు. పుట్టిన తర్వాత నవజాత శిశువును గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని తన ఇంట్లో ఫ్రీజర్‌లో భద్రపరిచింది. ఆ మహిళ తన ఐదవ బిడ్డను కూడా అదే పద్ధతిలో హత్య చేసింది. అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మొదట ఆమె పోలీసులకు సహకరించలేదు. సెర్చ్ వారెంట్ తో వచ్చి, ఇంట్లో సోదాలు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఫ్రిజ్ లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. కాగా, 2022లో ఇలాంటి కేసులో, జియోంగ్గి ప్రావిన్స్‌లో చనిపోయిన తమ శిశువు మృతదేహాన్ని మూడు సంవత్సరాల పాటు కంటైనర్‌లో దాచిపెట్టినందుకు దక్షిణ కొరియాలోని ఒక జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 నెలల కూతురు చనిపోయాక ఆ దంపతులు మూడేళ్లపాటు దాచిపెట్టారని అప్పుడు పోలీసులు తెలిపారు.

Spread the love