Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మానం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ –  సిద్దిపేట 
సిద్దిపేట 8వ వార్డులోని స్ప్రింగ్ డేల్స్ హైస్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించినందుకు వారిని ప్రోత్సహిస్తూ వార్డు కాంగ్రెస్ నాయకులు దున్నపోతుల నాగరాజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, చదువులో రాణించాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, స్కూల్ ప్రిన్సిపాల్ కి మొమెంటో, పెన్నులను ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు సభ్యులు ముక్క శ్రీనివాస్ , నజీర్, గంగరాజు, నరేష్, యాదగిరి, వార్డు పెద్దలు , కాంగ్రెస్ నాయకులు,  పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -