నిరుద్యోగ యువకుని ఆత్మహత్య

Suicide of an unemployed youthనవతెలంగాణ- తొర్రూర్‌ రూరల్‌
ఉద్యోగం రాదనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ రూరల్‌ మండలం హచ్యుతాండ గ్రామపంచాయతీ పరిధిలోని బొత్తల తండాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గుగులోత్‌ యాకోబు-బుజ్జిల కుమారుడు రాజకుమార్‌ (26) ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యాడు. రాజకుమార్‌ మండల పరిధిలోని శారద స్కూల్లో పదో తరగతిలో 10/10, ఇంటర్‌లో 989 మార్కులు, బీటెక్‌ సివిల్‌ ఇంజినీర్‌లో 85% సాధించాడు. 2020 నుంచి ఫ్రెండ్స్‌తో ఉంటూ ఏఈఈ, గ్రూప్‌-2 మరియు 4కు ప్రిపేర్‌ అయ్యాడు. ఏఈఈ పేపర్‌ లీకేజ్‌ కావడం, గ్రూప్‌-2 పరీక్ష వాయిదా పడటంతో ఆందోళనకు గురయ్యాడు. ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్‌ అయినా ఉద్యోగం వస్తుందోరాదోనని ఆందోళనకు గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తమ కొడుకు మృతికి ప్రభుత్వమే కారణమని తండ్రి యాకోబు ఆవేదన వ్యక్తం చేశాడు.

Spread the love