నేడు ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా కీలక పోరు

నవతెలంగాణ – హైదరాబాద్:  వన్డే ప్రపంచకప్‌ 2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా నేడు పదో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. మెగా టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియా.. ఈసారి మాత్రం తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన సౌతాఫ్రికా ఈసారి ఎలాగైన కప్పు కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. అనుకున్నట్లుగానే టోర్నీని ఘనంగా ఆరంభించింది. జట్టు మొత్తం స్టార్లతో నిండిన సౌతాఫ్రికా.. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై రికార్డు స్థాయిలో 428 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు ప్రొటీస్ ప్లేయర్లు సెంచరీలతో కదం తొక్కారు.

Spread the love