నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ఆవరణ మొత్తం నీటితో నిండుకోవడంతో కార్యాలయంలో పని కోసం వచ్చే వారకి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయం చెట్టు నీరు నిండిపోవడంతో కుంటల కనబడుతోంది. ఆ ఆవరణ మొత్తం నింపినట్లైతే నీరు నిలవకుండా ఉండే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. నిలిచిన నీటిని మరోవైపు తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.