నవతెలంగాణ-కంటోన్మెంట్
బస్తీ దవాఖాన ఏర్పాటు విషయంపై ఆదివారం సాయంత్రం 7వ వార్డు న్యూ గాంధీనగర్ వార్డు అధ్యక్షుడు ఈ తేజ పాల్ అధ్యక్షతన బీఆర్ఎస్ నాయకులు స్థానికులు సమావేశమయ్యారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య, నందిత, నివేదిత నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ పాల్ మాట్లాడుతూ సాయన్న కషి వల్ల న్యూ ఓల్డ్ గాంధీనగర్ వాసులకు బస్తీ దవాఖాన ఏర్పాటు అవుతుందని చెప్పారు. అంతకుముందు ఆయన కుమార్తెలు నందిత, నివేదితలు మాట్లా డుతూ తమ తండ్రి సాయన్న ఐదు బస్తీ దవఖానాలు మంజూరు చేయించారని.. అవి ఇప్పుడు ఏర్పాటు కానున్నయని తెలిపారు. కాగా ఈ సందర్భంగా తేజ పాల్ అధ్యక్షతన స్థానికులు దివంగత ఎమ్మెల్యేను గుర్తు చేసుకుని ఆయనకు కతజ్ఞతలు చెప్పారు