నవతెలంగాణ హైదరాబాద్: డిసెంబర్ 3 ఆదివారం ఉదయం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తో ఓట్ల లెక్కింపు ప్రకియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 10 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకావం ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు.