ఫిబ్రవరి 8న సెలవుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8వ తేదీన సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగానే గుడ్‌న్యూస్‌. ముస్లింల షబ్-ఇ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8న షబ్-ఇ-మెరాజ్‌కి సెలవు ప్రకటించింది. అయితే ఇది సాధారణ సెలవు కాకుండా ఆప్షనల్‌ హాలిడేగా పేర్కొంది. అయితే.. షబ్-ఇ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది. దీంతో ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆరోజున అన్ని విద్యాసంస్థలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించారు. అయితే.. ఫిబ్రవరిలో సాధారణ సెలవులు లేవు. సాధారణ పండుగలు జనవరి తరువాత మార్చిలోనే ఉన్నాయి.

Spread the love