తెలంగాణ చేనేత ఐక్య వేదిక..

– రాష్ట్ర ఉపాద్యక్షులుగా నిజామాబాదు జిల్లా కేంద్రానికి చెందిన సిలివేరి శంకర్ నియామకం

నవతెలంగాణ -కంటేశ్వర్ 

తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాద్యక్షులుగా నిజామాబాదు జిల్లా కేంద్రానికి చెందిన సిలివేరి శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అద్యక్షులు రాపోలు వీరమోహన్ శంకర్ కు నియామక ఉత్తర్వులు అందజేశారు. తెలంగాణ చేనేత ఐక్య వేదిక ద్వారా కార్మికుల పరిరక్షణ కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా వీరమోహన్ శంకర్ కు సూచించారు.

Spread the love