– కొలీజియం సిఫారసు
న్యూఢిల్లీ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆయనతోపాటు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టిని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసుతో సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ ఉజ్జల్ జస్టిస్ భూయాన్ను నియమించారు. 2022 జూన్ 28 నుంచి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భూయాన్ పని చేశారు. కొలీజియం సిఫారసుతో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు బదిలీ కానున్నారు.