నవతెలంగాణ – గజ్వేల్: ఈ రోజు తెలంగాణ హై కోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చేతుల మీదుగా గజ్వేల్ పట్టణంలో నూతన కోర్టు భవనానికి భూమి పూజ చేశారు. జిల్లా న్యాయస్థానంతోపాటు జిల్లా అదనపు న్యాయస్థానాలూ ఏర్పాటు చేశారు. ప్రస్తుత కోర్టు భవనంలోని 3వ అంతస్తులో అదనపు గదుల నిర్మాణం కోసం హైకోర్టు రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఈ భవన నిర్మాణ పనుల శంకుస్థాపన కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ భూమి పూజ చేశారు . హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్రావు, అనుగు సంతోష్రెడ్డి కూడా వచ్చరు. శంకుస్థాపన అనంతరం వీరంతా మెదక్ చర్చి, ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని దర్శించుకోనున్నారు.