– కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో పెద్ద రాష్ట్రాల కేటగిరిలో అగ్రభాగాన నిలిచింది. ఈ మేరకు కేంద్ర పట్టణా భివృద్థి శాఖ మంత్రి హిర్దిప్ సింగ్ గారి పూరి చేతుల మీదిగా తెలంగాణ ప్రభుత్వం తరుఫున మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, మెప్మా ప్రాజెక్టు మేనేజర్ చైతన్య గారు అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులను కేంద్ర మంత్రి అభినందించారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చే పిఎంస్వాన్ నిధి ప్రారంభించి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందించారు. వీధి వ్యాపారులకు ఇచ్చే రుణాలపై స్టాంప్ డ్యూటీని మినహాయించిన దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ.