బస్సు బోల్తా.. పది మందికి గాయాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం ఉదయం ప్రయివేటు బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు.. అడ్డాకుల సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love