పాకిస్థాన్ లో కిడ్పాప్: 11 మందిని చంపిన ఉగ్రవాదులు

నవతెలంగాణ – కరాచీ : పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నోష్కి జిల్లాలోని హైవేపై కాపు కాసిన కొందరు ముష్కరులు.. క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్నారు. బస్సులోని 9 మంది ప్రయాణికులను వారు కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఇతర ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఓ వంతెన సమీపంలో ఆ తొమ్మిది మంది మృతదేహాలు దొరికాయి. మరో ఘటనలో ఇదే రహదారిపై ప్రయాణిస్తున్న కారుపై దుండగులు కాల్పులకు పాల్సడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై ఇప్పటి వరకూ ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు.

Spread the love