స్కూల్ కి వెళ్తున్నాను అని చెప్పి బాలుడు అదృశ్యం

నవతెలంగాణ- రామారెడ్డి
స్కూలుకు వెళ్లిన బాలుడు అదృశ్యమైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని స్కూల్ తాండకు చెందిన పిపావత్ ప్రవీణ్ (14) సోమవారం పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి, తిరిగి రాకపోవడంతో తండ్రి పాఠశాలలో, చుట్టుపక్కల, బంధువుల ఇండ్లలో వెతికిన ఆచూకీ దొరకపోవడంతో మంగళవారం తండ్రి సేవ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
Spread the love