మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి

నవతెలంగాణ- అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి మరోసారీ తన మానవత్వాన్ని చాటుకున్నారు. మల్టిపుల్ డిజెబిలిటీతో బాధపడుతున్న రెండున్నర సంవత్సరాల బైపిళ్ళ నారాయణ నిఖిల్ కు ఆర్ధిక సహాయం చేశారు. చిన్నారి నిఖిల్ తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమారుని వివాహానికి హాజరైన సందర్భంగా సీఎం జగన్ ను కలిసారు. ఎడమ కన్ను, చెవి అంగవైకల్యం మల్టిపుల్ డిజబిలిటీ తో బాధపడుతున్నాడు నిఖిల్. విజయవాడ నగరంలోని భవానిపురంలో నివాసం ఉంటున్న బైపిళ్ళ రమేష్, లక్ష్మీ పద్మ దంపతుల కుమారుడు నిఖిల్.  ఆ చిన్నారి అనారోగ్య సమస్యలను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వివరించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నిఖిల్ కు వైద్య సేవల కోసం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు. వెంటనే లక్ష రూపాయల చెక్కును కలెక్టరేట్‌లో అందజేశారు.

Spread the love