నవతెలంగాణ-అంబర్పేట్
సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమానికి బుధవారం అంబర్పేట్ నియోజకవర్గ, నల్లకుంట డివిజన్ మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలో వెయ్యి మందికిపైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులతో కలిసి తిలక్నగర్ రైల్వే బ్రిడ్జి నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు, పెద్దలు వీ. హనుమంతారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ భగవాన్, ఎం రాజ్ గౌడ్, జిల్లా వెంకటేష్, ఆర్ రవికుమార్, డి రమేష్, లాలయ్య గౌడ్, అనిల్ కుమార్, డి రాజు, పప్పీ,తరుణ్, నర్సింగ రావు గౌడ్, ఎస్ లక్ష్మి, విజయలక్ష్మి, వరలక్ష్మి, అనిత, కవిత, ప్రమీల, పద్మ, రత్న, మంజుల తదితరులు పాల్గొన్నారు.