సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- చింతకాని
ప్రజా సమస్యలే అజెండాగా పనిచేసిన కురుగుంట్ల పెద్ద సైదారెడ్డి మృతి సిపిఐ(ఎం)కి తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రామకృష్ణాపురం గ్రామ మాజీ సర్పంచ్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కురుగుంట్ల పెద్ద సైదారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం సిపిఐ(ఎం) బృందం రామకృష్ణాపురంలోని సైదారెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన మృతదేహంపై పార్టీ కండువా కప్పి నివాళులర్పించారు .ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలే తన ఎజెండాగా సైదారెడ్డి పనిచేసేవాడని, సర్పంచ్గా తన పదవీకాలం గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేసి రామకృష్ణాపురం గ్రామాభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. సైదారెడ్డి ఆశయ సాధన కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సైదారెడ్డి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. నివాళులు అర్పించిన వారిలో సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మన్నేపల్లి సుబ్బారావు, మధిర నియోజకవర్గ ఇంచార్జ్ పాలడుగు భాస్కర్, మండల కార్యదర్శి మడిపల్లి గోపాల్రావు, నాయకులు బండారు రమేష్, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు, దేశబోయిన ఉపేందర్, వాకా సీతారామిరెడ్డి తదితరులు ఉన్నారు.
సైదారెడ్డి మృతికి పలువురి నివాళులు
రామకృష్ణాపురం గ్రామ మాజీ సర్పంచ్, సిపిఎం సీనియర్ నాయకులు కురుగుంట్ల పెద్ద సైదారెడ్డి మృతదేహాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, కన్నేబోయిన కుటుంబరావు, కురుగుంట్ల రవీందర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, కొండపర్తి గోవిందరావు, ఏపూరి రవీంద్ర బాబు, జిల్లా సమితి సభ్యులు పగిడపల్లి యేసు, మండల కార్యదర్శి పావులూరి మల్లికార్జున్, మాజీ ఎంపీపీ కన్నీబోయిన విజయమ్మ తదితరులు సైదారెడ్డి మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.