జీపీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అంబెడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత..

నవతెలంగాణ -డిచ్ పల్లి

గ్రామపంచాయతీ కార్మికుల గత 20 రోజులుగా సమ్మె చేస్తున్న వారి సమస్యలను  ప్రభుత్వం పట్టించుకోకపోవడం హేయమని కోరుతూ కార్మికులు మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా కార్మికులు  మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెతో పారిశుధ్య పనులు నిలిచిపోయాయని, ప్రతి గ్రామంలో శుభ్రంగా ఉంచేది గ్రామపంచాయతీ కార్మికులేనని, గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనలు ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానాన్ని తీసేయాలని, వారసత్వ పనిని కొనసాగించాలని,  ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నట్టే కార్మికుల జీతాలు పెంచాలని, సమ్మె చేస్తున్న కార్మికుల డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి పి కార్మికులు పాల్గొన్నారు.
Spread the love