ముగిసిన రాష్ట్రపతి శీతాకాలం విడిది

The President's winter vacation is over–  ఢిల్లీకి ప్రయాణం
–  హకీంపేట విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన సీఎం, గవర్నర్‌, మంత్రులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిది ముగిసింది. హైదరాబాద్‌లో శీతాకాల విడిది కోసం ఈ నెల 18వ తేదీన భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి.. పర్యటన శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి శనివారం ఉదయం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని హకీంపేట విమానాశ్రయం నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. విమానాశ్రయంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, పంచాయతీరాజ్‌, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌, త్రివిధ దళాలకు చెందిన అధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.

Spread the love