ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
నవతెలంగాణ-పెద్దవంగర
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల ఇంచార్జి ఎర్రబెల్లి గోపాల్ రావు అన్నారు. శనివారం మండలంలోని పోచంపల్లి గ్రామంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంతో పాటు ప్రజల దైనందిన జీవన చర్యలకు విఘాతంగా మారిన కోతుల బెడద నివారణకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక చొరవ తీసుకోవడం ప్రశంసనీయం అన్నారు. దీంతో గ్రామంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ బానోత్ రవీందర్ నాయక్, సీనియర్ నాయకులు కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి, శ్రీరాం సుధీర్, సలిదండి సుధాకర్, మాజీ జడ్పీటీసీ జాటోత్ కమలాకర్, మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎర్రసాని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love