నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో దూసుకుపోయాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అంతకంతకూ పెరుగుతూనే పోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 446 పాయింట్లు లాభపడి 63,416కి చేరుకుంది. నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 18,817 వద్ద స్థిరపడింది. రియాల్టీ, బ్యాంకెక్స్, మెటల్, ఇన్ఫ్రా సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి.