దొంగల భీభత్సం.. బంగారం,నగదు చోరి

నవతెలంగాణ – భిక్కనూర్

మండలంలోని భాగిర్తిపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన కుమార్ కు చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలో ఉన్న బంగారం, నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం కుమార్ స్థానిక పోలీసులకు సమాచారం అందించగా,  క్లూస్ టీం సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.
Spread the love