నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ఉప్పల్లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఓ యువకుడు బైక్పై వెళ్తుండగా అది స్కిడ్ అయింది. దీంతో బైక్ వెనుకాల దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఆ యువకుడి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. కొడుకు మృతదేహాన్ని చూసి అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.