- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
రైతులు పండించిన పంటను ప్రయివేటు దళారులకు అమ్ముకొని మోసపోవద్దంటూ సర్కార్ మద్దతు ధర కేంద్రంలోని పంటను అమ్మితే నగదు చెల్లించరని మండల శనగ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొనుగోలు కేంద్రలో ధాన్యాన్ని అమ్మి 38 రోజులవుతున్నా ఇప్పటివరకు డబ్బులు చేతికి అందలేదని వారు వాపోయారు. ఈ క్రమంలో సోమవార తహశీల్దార్ కార్యాలయన్ని వారు ముట్టడించారు. అనంతరం తమకు న్యాయం చేయాలని తహశీల్దార్ ను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



