ప్రమాణ స్వీకారోత్సవానికి వేలాదిగా తరలి రావాలి

నవతెలంగాణ – గోవిందరావుపేట
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పైడాకుల అశోక్ పటేల్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింత క్రాంతి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో క్రాంతి మీడియాతో మాట్లాడుతూ గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పైడాకుల కృష్ణమూర్తి కుమారుడు పైడాకుల అశోక్ నేడు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం యావత్తు మండలం గర్వించదగ్గ విషయమని అన్నారు. కృష్ణమూర్తి కూడా ఒకప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో విజయాలను పార్టీకి అందించారని అన్నారు. తండ్రి దోవలో నడిచిన కొడుకు అశోక్ పటేల్ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఆ కృషి ఫలితమే నేడు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా లభించిన అరుదైన గౌరవమని అది మన అందరికీ గర్వకారణమని అన్నారు. బుధవారం ములుగులో ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జరిగే ప్రమాణ స్వీకారం మహోత్సవానికి మండలం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివెళ్లి బైక్ ర్యాలీతో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Spread the love