ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోజువారీ కూలీలను తీసుకువెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు.. లక్ష్మీ(45), రాజమ్మ(50), వైష్ణవి(30)గా గుర్తించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love