అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటించింది. ఎకే ఎంటర్టైన్ మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కన్నెగంటి మీడియాతో మాట్లాడుతూ, ‘ఇదొక హైబ్రిడ్ జోనర్లో తెరకెక్కిన సినిమా. చాలా మందికి తెలియంది, తాతలు తండ్రుల ద్వారా కేవలం వినడమే తప్పితే చరిత్రలో ఎక్కడా రాసి ఉండని కొన్ని అంశాలు సెకండ్ హాఫ్లో ఉంటాయి. ఇప్పుడు మైథాలజీ కంటెంట్కి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ‘కాంతార, బింబిసార, విరూపాక్ష’ ఇలాంటి సౌండింగ్ ఉంటే ఆడియన్స్కి వెంటనే కనెక్టింగ్ అవుతుందని అనిపించింది. ఈ సినిమాలో ఒక తెగ వుంది. ఆ తెగ హిడింబా సురుడి లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ కథకు కూడా ఆ టైటిల్ యాప్ట్ అనిపించి ‘హిడింబ’ అనే పేరు పెట్టాం. మైథాలజీ తర్వాత ప్రేక్షకులకు బాగా ఆసక్తి చూపించే సబ్జెక్ట్ హిస్టరీ. హిడింబలో చూపించే హిస్టరీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. మొత్తంగా ఇది హిస్టారికల్ టచ్ ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అంతేకాదు ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే సర్ప్రైజ్లూ ఉన్నాయి. ఈ కథకు అశ్విన్ కటౌట్ సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా కోసం ఆయన బాగా మేకోవర్ అయ్యారు. నేపథ్య సంగీతం మిమ్మల్మి మైస్మరైజ్ చేస్తుంది. టెక్నికల్గా ఈసినిమా చాలా ఇంపాక్ట్ ఫుల్గా ఉంటుంది. నిర్మాతల వైపు నుంచి కూడా నాకు పూర్తి స్వేచ్ఛ దొరకడంతో అనుకున్న విధంగా తీశాను’ అని అన్నారు.