త్రో బాల్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక 

త్రో బాల్ జిల్లా స్థాయి పోటీలలో శాయంపేట జెడ్ పి ఎస్ ఎస్ విద్యార్థుల ప్రతిభ, ప్రథమ స్థాయిలో నిలిచిన విద్యార్థులు, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
నవతెలంగాణ –  శాయంపేట
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థులు శనివారం జరిగిన త్రో బాల్ జిల్లా స్థాయి బాలికల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి అందుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ఇషా ఫౌండేషన్  ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్ మహేందర్ జి క్రీడా పోటీలను ప్రారంభించారు. శాయంపేట ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థులు త్రో బాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థాయిలో నిలిచారు. వీరికి ఇషా ఫౌండేషన్ సభ్యులు శిరీష, వేణుగోపాల్ ప్రశంసా పత్రాలతో పాటు, 5 వేల నగదు పురస్కారాన్ని అందించారు. సెప్టెంబర్ నెలలో సిద్దిపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులు ఎంపికైనట్లు పిఈటి కరిత, టీం కోచ్  శ్రీధర్ తెలిపారు. త్రో బాల్ జిల్లా స్థాయి క్రీడలలో ప్రథమ బహుమతి అందుకున్న విద్యార్థులను, పిఈటి కరితను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీతామహాలక్ష్మి, ఇంచార్జి ఎంఈఓ రమాదేవి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Spread the love