నేడు కేసీఆర్ కరీంనగర్ పర్యటన

నవతెలంగాణ హైదరాబాద్: నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతులకు భరోసాకల్పించేందుకు, మాజీ ముఖ్యమంత్రి,  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుమ్ పూర్ గ్రామంలో ఎండిన పంట పొలాలను కేసీఆర్ పరిశీస్తారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం, విశ్రాంతి. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలిస్తారు. నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. సాయంత్రం 3:00 గంటలకు శాభాష్ పల్లి బ్రీడ్జి వద్ద మధ్యమానేరు ప్రాజెక్టును ఆయన పరిశీలించనున్నారు. సాయంత్రం 4:00గంటలకు సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో పాల్గొంటారు.

Spread the love