వైద్యులు మధు శేఖర్ కు సన్మానం

నవతెలంగాణ -ఆర్మూర్
 పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు మధు శేఖర్ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ చైర్మన్ గా నియమించబడిన సందర్భంగా సోమవారం డివిజన్ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అదే స్టేషన్ ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు మాదరి సాయన్న, ఉపాధ్యక్షులు గంగారాం, కార్యదర్శి బొమ్మెన శంకర్, క్యాషియర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love