నవతెలంగాణ హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మహాలక్ష్మి పథకం అమలుతో అత్యధిక సంఖ్యలో మహిళను గమ్యస్థానానికి చేర్చడంలో టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పథకం అమలు నాటి నుంచి నేటి వరకూ 13.50కోట్ల మంది మహిళలను గ్రేటర్హైదరాబాద్ ఆర్టీసీ జోన్ గమ్యస్థానాలకు చేర్చింది.
ప్రథమ స్థానంలో హైదరాబాద్ రీజియన్..
హైదరాబాద్ రీజియన్లో 1,410 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. సికింద్రాబాద్ జోన్లో 1,260 బస్సులు నడుస్తున్నాయి. ఇలా గ్రేటర్జోన్ మొత్తం 2,670 బస్సులలో నిత్యం 20 లక్షల నుంచి 21 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 14.50 లక్షల మంది మహిళా ప్రయాణికులే ఉన్నారు. మహాలక్ష్మి పథకం అమలు కాక ముందు 4.50 లక్షలు మాత్రమే ఉండే మహిళా ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం 10 లక్షలు పెరిగింది.