పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ..

నవతెలంగాణ – పంజాబ్: పంజాబ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్-ఢిల్లీ రైల్వే లైన్‌లోని ఫతేఘర్ సాహెబ్‌లో ఈరోజు తెల్లవారుజామున రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి.  అయితే.. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయ పడ్డారని అధికారులు గుర్తించారు. నివేదికల ప్రకారం, గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ తరుణంలోనే ఆ గూడ్స్‌ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love