క్రిమియాపై ఉక్రెయిన్ భారీ దాడి

నవతెలంగాణ – ఢిల్లీ
పాశ్చాత్య దేశాల ఇచ్చిన ఆయుధ సంపత్తితో రష్యాపై ప్రతిదాడులతో విరుచుకుపడుతున్న ఉక్రెయిన్ తాజాగా సెవెస్తపోల్‌లోని రష్యా నౌకాదళ ప్రధాన కేంద్రంపై మిసైల్‌తో భారీ దాడి చేసింది. ఈ దాడిలో కార్యాయలంలో మంటలు చెలరేగాయి. తొలుత ఓ వ్యక్తి మరణించారన్న వార్తలు వచ్చినా రష్యా అధికారులు ఆ తరువత ఓ నౌకాదళ సిబ్బంది కనిపించడం లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ దాడి చేసినట్టు కూడా ధ్రువీకరించారు. సెవెస్తపోల్ కార్యాలయం రష్యా నల్ల సముుద్రం నౌకదళ ప్రధాన కేంద్రం. ఉక్రెయిన్‌పై సముద్రదాడులను రష్యా ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తుంటుంది. కాగా, దాడి తాలూకు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Spread the love