అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరోసారి వెంకీ..

నవతెలంగాణ – హైదరాబాద్: విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి అనిల్ – వెంకీ జతకట్టనున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమంతో రేపు ఉదయం 11.16 గంటలకు లాంఛనంగా ప్రారంభంకానుంది. ఎస్ వీసీ బ్యానర్‌లో రాబోతున్న 58వ సినిమాను శిరీశ్ నిర్మించనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love