- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఆన్సాన్పల్లి గ్రామపరిధిలో ఒకటవ వార్డులో గత రెండు వారాలుగా నీటి ఎద్దడి ఏర్పడటంతో ప్రజలు అల్లాడుతున్నారు. గొంతు తడుపుకోవడానికి ఎడ్లబండిపై అందుబాటులో ఉన్న బోర్ మోటార్ వద్ద నీటిని తెచ్చుకుంటు పడరాని పాట్లు పడుతున్నారు.నీటి సమస్యను పరిస్కారం చేయాలని ప్రజాప్రతినిధులు, పంచాయతీ,మిషన్ భగీరథ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.రోజురోజుకూ ఎండలు మండడంతో దాహం తీర్చుకోవడానికి,ఇతరత్రా అవసరాల కోసం ఇబ్బందులకు గురివుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్యను పరిస్కారం చేయాలని కోరుతున్నారు.
- Advertisement -



