ఎమ్మెల్యే వంశీకృష్ణ పైన మాకు నమ్మకం ఉంది

Oplus_0

– గిరిజనులకు భూముల పట్టాలు ఇస్తారు

– ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటాము
నవతెలంగాణ – అచ్చంపేట 
మండల పరిధిలోని బక్క లింగాయపల్లి గ్రామంలో 127 సర్వే నెంబర్లు గల భూములకు గిరిజనులకు పట్టాలు రాలేదని కారణంతో లోక్ సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని గ్రామానికి చెందిన రాము నాయక్, పంచు నాయకులు అన్నారు. గురువారం అచ్చంపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాకు పట్టాలు ఇప్పించలేదు. నిర్లక్ష్యం చేశారు. కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పైన మాకు నమ్మకం ఉంది. పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే గ్రామానికి వచ్చి గిరిజనులకు పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొంటామని ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకుంటామని వారు తెలిపారు.
Spread the love