చంద్రశేఖర్ ఆజాద్ పైన కాల్పులు జరపడాన్నితీవ్రంగా ఖండిస్తున్నాం

– ఎమ్మార్పీఎస్ టీఎస్ కోర్ కమిటీ సభ్యులు రేణికుంట నాంపల్లి
నవతెలంగాణ – కంటేశ్వర్
ఎమ్మార్పీఎస్ టిఎస్ దళిత నేత చంద్రశేఖర్ ఆజాద్ పైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సహరాన్పూర్ పట్టణంలో కాల్పులు జరిపి చంపడానికి ప్రయత్నం చేయడం దారుణమైన సంఘటన ఈ కాల్పులను ఎమ్మార్పీఎస్ టీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ టీఎస్ కోర్ కమిటీ సభ్యులు రేణికుంట నాంపల్లి తెలిపారు. ఈ మేరకు నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ కోర్ కమిటీ సభ్యులు రేణికుంట నాంపల్లి అణగారిన ప్రజల హక్కుల కోసం తెగించి పోరాడే వీరులను చంపాలని చూడడం హేమమైన చర్య ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆజాద్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల్లోకి రావాలని కోరుచున్నాం. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ సల్లూరి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు గుండారం మోహన్, మోతే భూమన్న, బచ్చపల్లి దేవయ్య, పొన్నాల సంజీవయ్య, కందుల రాములు, గుడిసె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love