నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయాలు.. ఉన్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆరు గ్యారెంటీల కోసం రూ.53,196 కోట్లు అంచనా వేస్తున్నట్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు, విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు, గృహ నిర్మాణానికి 7740 కోట్లు, నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు పెడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మాది ప్రజల ప్రభుత్వమని ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చామని ప్రకటించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రైతులకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి శుభవార్త చెప్పారు. త్వరలోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేశారు. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ రూపొందించినట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ.2 లక్షల రైతు రుణమాఫీపై విధివిధానాలు ఖరారు చేయబోతున్నామని వెల్లడించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
ఏ శాఖకు ఎన్ని కోట్లంటే
- ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
- వ్యవసాయానికి రూ.19.746 కోట్లు
- ఐటీ శాఖకు రూ.774 కోట్లు
- పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
- విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
- మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
- వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
- ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
- గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు
- మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు
- ‘ప్రజావాణి’లో రెండు నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054
- ఇండ్ల కోసం వచ్చినవి 14,951
- దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత
- ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
- మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నాం
- ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు అందిస్తాం
- గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం
- దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి
- పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి
- ప్రభుత్వం నుంచి 2 లెదర్ పార్కులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం
- డ్రై పోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ ప్రణాళిక
- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేధ ఉపయోగిస్తాం
- ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధికి నూతన పాలసీ
- రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు
- ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్ సంస్థతో సంప్రదింపులు
- దేశంలోనే అత్యంత పటిష్ఠమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం