- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఆ పార్టీ శాసనసభా పక్షం విప్ జారీచేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ శాసనమండలి విప్ దేశపతి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం శాసనమండలి సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విధిగా హాజరు కావాలని కోరారు. పార్టీ ఆదేశాల ప్రకారం నడుకోవాలనీ, ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభం నుంచి వాయిదా వేసే వరకు సభలోనే ఉండాలని సూచించారు.
- Advertisement -



