ఫైనల్‌కు చేరేదెవరో?

ఫైనల్‌కు చేరేదెవరో?– నేడు ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ సెమీఫైనల్స్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ : మూడుసార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌, రెండు సార్లు చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఎదుర్కొనేందుకు తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న పుణెరి పల్టాన్‌, హర్యానా స్టీలర్స్‌ సిద్ధమయ్యాయి. ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ సెమీఫైనల్స్‌ నేడు హైదరాబాద్‌లోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరుగనున్నాయి. తొలి సెమీఫైనల్లో మూడు సార్లు టైటిల్‌ విన్నర్‌ పట్నా పైరేట్స్‌తో పుణెరి పల్టాన్‌ పోటీపడుతుండగా, రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో తొలి సారి సెమీఫైనలిస్ట్‌ హర్యానా స్టీలర్స్‌ తాడోపేడో తేల్చుకోనుంది. గ్రూప్‌ దశలో టాప్‌-2లో నిలిచిన పుణెరి పల్టాన్‌, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌లు నేడు సెమీఫైనల్లో ఫేవరేట్స్‌గా బరిలోకి దిగుతున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్‌ టైటిల్‌ అందుకోవాలనే తపన పుణెరి పల్టాన్‌, హర్యానా స్టీలర్స్‌ను ప్రమాదకర ప్రత్యర్థులుగా మార్చింది. రాత్రి 8 గంటలకు తొలి సెమీఫైనల్‌ ఆరంభం కానుండగా, ఆ వెంటనే రెండో సెమీఫైనల్‌ ఆరంభం కానుంది. టైటిల్‌ పోరు మార్చి 1న జరుగనున్న సంగతి తెలిసిందే.

Spread the love