నూతన సీఎస్‌ను అభినందించిన చైర్మెన్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా నియమితురాలైన ఏ శాంతికుమారికి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కే వాసుదేవారెడ్డి అభినందనలు తెలిపారు. బుధవారంనాడాయన బీఆర్కే భవన్‌లోని సీఎస్‌ కార్యాలయంలో ఆమెను కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో సత్కరించారు.

Spread the love