రాబోయే ఎన్నికల్లో ఆర్‌జెడి, జెఎంఎం కలిసి పోటీ

రాంచి : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌జెడి, జెఎంఎం కలిసి పోటీ చేస్తాయని బీహార్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ చెప్పారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌తో శనివారం తన నివాసంలో సమావేశం అనంతరం తేజస్వి యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళు గురించి, రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై ఇరువురం మాట్లాడుకున్నామని తెలిపారు. జార్ఖండ్‌లో పార్టీ కార్యకలాపాలను సమీక్షించాలన్న ఆర్‌జెడి ఆలోచనల గురించి కూడా తేజస్వి చెప్పారు. లాలూ అనారోగ్యంతో గతంలో అనుకున్న కొన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయని, కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగవడంతో మళ్లీ అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్‌లో మహాగత బంధన్‌ కూటమిని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామన్నారు. చవకబారు రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపి ఓటర్లను కొనుగోలు చేసేందుకు యత్నిస్తోందన్నారు.

Spread the love