రాష్ట్రంలో ఆసియా జర్నలిస్టుల బృందం పర్యటన

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆసియన్‌ ఇండియా మీడియా ఎక్చేంజ్‌లో భాగంగా 8 ఆసియా దేశాలకు చెందిన 17 మంది జర్నలిస్టుల బృందం తెలంగాణలో మూడు రోజుల పర్యటనకు ఆదివారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆసియన్‌ సెక్రటేరియట్‌కు చెందిన సీనియర్‌ ఆఫీసర్‌ పట్గియా టెంగ్‌ఫ్యూంగ్‌ ఆధ్వర్యంలో ఈ బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్నది. థాయిలాండ్‌, బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, థాయిలాండ్‌ దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు ఈ బందంలో ఉన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన ఈ బృందానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు వై. వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు బిమల్‌ బాజ్‌పేయి స్వాగతం పలికారు. ఈ బృందం షామీర్‌పేటలో జరిగే నాల్గవ ఏషియన్‌ ఇండియా యూత్‌ సమ్మిట్‌లో పాల్గొంటుంది. అలాగే భారత్‌ బయోటెక్‌, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయాలతోపాటు వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు.

Spread the love