పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీలకు సన్మానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చే మార్చి, మే నెలలో పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీలు వుల్లోల గంగాధర్‌ గౌడ్‌, ఎలిమినేటి కృష్ణ రెడ్డి, కుర్మయ్యగారి నవీన్‌ కుమార్‌,సయ్యద్‌ అమిన్‌ ఉల్‌ హసన్‌ జాఫ్రీ, కాటేపల్లి జనార్దన్‌ రెడ్డి, డి.రాజేశ్వర్‌ రావు, ఫరూక్‌ హుస్సేన్‌లను ఆదివారం శాసనమండలి ప్రాంగణంలో సన్మానించారు. మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, హౌంశాఖ మంత్రి మహమూద్‌ అలీ వారిని ఘనంగా స న్మానించి, సత్కరిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రె డ్డి,మధుసూదనా చారి, శేరి శుభాష్‌ రెడ్డి, ఎం.యస్‌ ప్రభాకర్‌ రావు, ఎల్‌. రమణ, రఘోత్తం రెడ్డి, కోటి రెడ్డి, దయనంద్‌, యాదవ రెడ్డి, దండే విఠల్‌, కూచుకుల్లా దామోదర్‌ రెడ్డి, తెలంగాణ శాసనసభ కార్యదర్శి డాక్టర్డా నరసింహా చార్యులు, బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి రమేష్‌ రెడ్డి, పాల్గొన్నారు.

Spread the love