ఇరాక్‌లో నాటుబాంబులతో వాహనంపై దాడి..10 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ :  ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం రాత్రి వారు ప్రయాణిస్తున్న వాహనం అమ్రానియా ప్రాంతానికి చేరుకోగానే కొందరు దుండగులు నాటుబాంబులతో వాహనంపై దాడిచేశారు. అనంతరం తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో కర్ఫ్యూ విధించి దుండగుల కోసం గాలిస్తున్నారు.

Spread the love