నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి హిందుస్థాన్ పెట్రోలియం బంక్ సమీపంలో కూలిపనికి వెళ్తున్న పాగి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి అకస్మాత్తుగా మూర్ఛవచ్చి రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) గొల్లమందల కృష్ణ, పైలట్ పెద్దగౌడ ఏకాంత్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి తక్షణమే తలకు కట్టుకట్టి, ఆక్సిజన్, సెలైన్, ఇంజెక్షన్లు అందిస్తూ ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూలీకి సకాలంలో వైద్యమందించి ప్రాణాలు నిలిపిన 108 సిబ్బందిని ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్, జిల్లా మేనేజర్ ఆలేటి ప్రణయ్ కుమార్ అభినందించారు.
సకాలంలో స్పందించి కూలీ ప్రాణాలు నిలిపిన 108 సిబ్బంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


